NABARD: ఏపీకి నాబార్డ్ గుడ్‌న్యూస్.. రూ.1931 కోట్ల రుణం విడుదల

  • చింతలపూడి ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగించనున్న ప్రభుత్వం
  • ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 410 గ్రామాలకు సాగు, తాగునీరు
  • మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
NABARD Sanctioned loan to Andhrapradesh

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది. ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.1931 కోట్ల రుణం మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయూత (ఎన్ఐడీఏ) కింద ఈ రుణాన్ని మంజూరు చేస్తున్నట్టు నాబార్డ్ తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఈ రుణాన్ని వినియోగించనుంది.

ఈ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని 33 మండలాల్లోని 410 గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 53.5 టీఎంసీల నీటిని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 2022 నాటికి చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • Loading...

More Telugu News