kala venkat rao: టీడీపీ ప్రజాచైతన్య యాత్ర కరపత్రం విడుదల చేసిన కళావెంకట్రావు

  • వైసీపీ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం
  • తొమ్మిది నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచింది
  • J-ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోంది
TDP leader kala venkat rao releases Prajachaitanya Yatra palm plate

రేపు ప్రకాశం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. రేపటి నుంచి 45 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా  ప్రజా చైతన్య యాత్ర కరపత్రంను టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు.

వైసీపీ తొమ్మిది నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచిందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని , ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచారని మండిపడ్డారు. ఇప్పటికే అర్హుల పింఛన్లు తొలగించారని, మరిన్ని పింఛన్లు తొలగించే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బలవంతంగా J-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఈ ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. 

More Telugu News