Digangana: దిశా పాత్ర మీ అందరికీ నచ్చుతుంది: దిగాంగన

  • దిగాంగన తాజా చిత్రంగా 'వలయం'
  • సస్పెన్స్ తో నడిచే కథాకథనాలు
  • ఈ నెల 21వ తేదీన విడుదల 
Valayam Movie

'హిప్పీ' సినిమాతో తెలుగు తెరకి దిగాంగన సూర్యవన్షి పరిచయమైంది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, తన అందచందాలతో యూత్ హృదయాలను దిగాంగన కొల్లగొట్టేసింది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'వలయం' ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ .."ఈ సినిమాలో నేను 'దిశా' పాత్రలో కనిపిస్తాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న 'దిశా' హఠాత్తుగా కనిపించకుండా పోతుంది. ఆమె ఏమైపోయింది? అనే సస్పెన్స్ తో ఈ కథ నడుస్తుంది. 'దిశా' పాత్ర చుట్టూ అనేక సమస్యలు అల్లుకుని కనిపిస్తాయి. అందువల్లనే ఈ సినిమాకి 'వలయం' అనే పేరు పెట్టారు. కథ .. నా పాత్ర అందరికీ నచ్చుతాయనే నమ్మకం వుంది. ప్రస్తుతం 'సీటీమార్' సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో గోపీచంద్ జోడీగా కూడా ప్రాధాన్యమున్న పాత్రనే చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News