BJP: మీరు పెంచుతున్న వారు.. మిమ్మల్ని కాటువేసేందుకు రెడీగా ఉన్నారు: కేసీఆర్‌పై లక్ష్మణ్ ఫైర్

Telangana BJP Chief Asks KCR did he know about Constitution
  • ఒవైసీ మెప్పు కోసమే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం
  • బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానం చేయాలి
  • మీకసలు రాజ్యాంగం తెలుసా?

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తప్పుబట్టారు. ఒవైసీ మెప్పు పొందేందుకే ఈ తీర్మానం తీసుకొచ్చారని అన్నారు. పార్లమెంటులో పూర్తి మద్దతుతో తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్రం ఎలా వ్యతిరేకిస్తుందని ప్రశ్నించిన లక్ష్మణ్, కేసీఆర్‌కు రాజ్యాంగం తెలియదా? అని నిలదీశారు.

మత వివక్షకు గురైన వారికి, శరణార్థులకు భద్రత కల్పించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు. కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే బంగ్లాదేశ్, పాకిస్థాన్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానం చేయాలని సవాలు విసిరారు. మజ్లిస్ నేతలను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని, కానీ ఆ పార్టీ నాయకులు కాటు వేసేందుకు రెడీగా ఉన్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News