BJP: మీరు పెంచుతున్న వారు.. మిమ్మల్ని కాటువేసేందుకు రెడీగా ఉన్నారు: కేసీఆర్‌పై లక్ష్మణ్ ఫైర్

  • ఒవైసీ మెప్పు కోసమే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం
  • బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానం చేయాలి
  • మీకసలు రాజ్యాంగం తెలుసా?
Telangana BJP Chief Asks KCR did he know about Constitution

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తప్పుబట్టారు. ఒవైసీ మెప్పు పొందేందుకే ఈ తీర్మానం తీసుకొచ్చారని అన్నారు. పార్లమెంటులో పూర్తి మద్దతుతో తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్రం ఎలా వ్యతిరేకిస్తుందని ప్రశ్నించిన లక్ష్మణ్, కేసీఆర్‌కు రాజ్యాంగం తెలియదా? అని నిలదీశారు.

మత వివక్షకు గురైన వారికి, శరణార్థులకు భద్రత కల్పించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు. కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే బంగ్లాదేశ్, పాకిస్థాన్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానం చేయాలని సవాలు విసిరారు. మజ్లిస్ నేతలను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని, కానీ ఆ పార్టీ నాయకులు కాటు వేసేందుకు రెడీగా ఉన్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

More Telugu News