Allari Naresh: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'నాంది'

  • మరో విభిన్న కథా చిత్రంగా 'నాంది'
  • 'అల్లరి' నరేశ్ కి 57వ సినిమా
  • తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు
Naandi Movie

'అల్లరి' నరేశ్ కథానాయకుడిగా విజయ్ కనకమేడల 'నాంది' సినిమాను రూపొందిస్తున్నాడు. దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా తాజాగా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలింది.

తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. 'అల్లరి' నరేశ్ కి ఇది 57వ సినిమా. ఇంతవరకూ ఈ తరహా పాత్రను చేయలేదనీ, తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 'బంగారు బుల్లోడు' టైటిల్ తో 'అల్లరి' నరేశ్ నుంచి మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే.

More Telugu News