రాజమహేంద్రవరంకు చిరూ.. కొరటాల టీమ్
- చిరూ కథానాయకుడిగా కొరటాల మూవీ
- పరిశీలనలో 'ఆచార్య' టైటిల్
- ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచన
ఈ షెడ్యూల్లో త్రిష కూడా పాల్గొననున్నట్టు చెబుతున్నారు. రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ఆచార్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని అందించే ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో చరణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. వరుస విజయాల దర్శకుడైన కొరటాల నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పట్ల అందరిలోను ఆసక్తి వుంది.