ఇదో విచిత్రం.. ఒంటెపై పెళ్లి మండపానికి వచ్చి పెళ్లికొడుకు నిరసన.. ఫొటో వైరల్
- కేరళలో ఘటన
- సీఏఏపై నిరసన
- 20 కిలోమీటర్లు ఒంటెపై ఊరేగింపు
హజా హుస్సేన్ అనే వ్యాపారి నిన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కొడుకుగా తయారై తిరువనంతపురం నుంచి వాజిమక్కులోని వివాహ వేదిక ( 20 కిలోమీటర్లు) వరకు అతడు ఒంటెపై ఊరేగింపుగా బయలుదేరాడు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతడి బంధువులంతా అతడి వెంట వెళ్లారు. దీంతో అతడు ఊరేగిన ప్రాంతాల్లో రోడ్లన్నీ రద్దీగా కనపడ్డాయి. అంతేకాదు, తన భార్యకు పెళ్లి కానుకగా రాజ్యాంగం ప్రతిని కూడా అందించాడు.