AAP: ఢిల్లీలో మొదలైన ‘ఆప్’ దూకుడు.. 5 స్థానాల్లో ఆధిక్యం

  • నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
  • ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ట్రెండ్స్
  • పోస్టల్ బ్యాలెట్లలో ఆప్ దూకుడు
AAP leads in Delhi assembly elections

ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం కాగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 67 స్థానాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ స్థానాలు ఈసారి కొంత తగ్గినా విజయం తథ్యమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. బీజేపీ 20 స్థానాల్లోపే పరిమితం అవుతుందని అంచనా వేశాయి.  

More Telugu News