Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • పూజ హెగ్డే తాజా నిర్ణయం 
  • ప్రభాస్ కోసం భారీ సెట్స్ 
  • 'కేజీఎఫ్' సీక్వెల్ లో రావు రమేశ్  
Pooja Hegde takes strong decicion

 *  తాజాగా హిట్టయిన 'అల వైకుంఠపురములో' చిత్రంతో కథానాయిక పూజ హెగ్డే క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే హిందీలో కూడా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రతి ఆఫర్ నీ ఒప్పుకోకూడదని పూజ నిర్ణయం తీసుకుందట. సినిమాలో తన పాత్రకి కూడా ప్రాధాన్యత వుండాలని అమ్మడు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 *  ప్రస్తుతం ప్రభాస్ తన తాజా చిత్రాన్ని 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రం కోసం హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో తాజాగా భారీ సెట్స్ ను వేయడం జరిగింది. ఈ లేక్ వ్యూ సెట్స్ లో ప్రభాస్, పూజ హెగ్డే జంటపై కొన్ని రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరిస్తారు.
*  ఆమధ్య సంచలన విజయాన్ని సాధించిన కన్నడ చిత్రం 'కేజీఎఫ్'కి దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సీక్వెల్ రూపొందిస్తున్నారు. యాష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. కాగా, ఇందులో రావు రమేశ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజా సమాచారం.

More Telugu News