ఏబీ వెంకటేశ్వరరావుపై ఐటీ, ఈడీ దాడులు జరిగితే ఆశ్చర్యపోయే వాస్తవాలు బయటకొచ్చేవి: చెవిరెడ్డి భాస్కరరెడ్డి
- అవినీతికి పాల్పడ్డ అరాచకవాది ఏబీ
- ఆయనపై కేంద్రం చర్యలు తీసుకోవాలి
- తెలంగాణలో ఏబీకి ఆస్తులు ఉన్నాయి
చంద్రబాబునాయుడు పీఏలపై కన్నా ముందు ఏబీ వెంకటేశ్వరరావుపై ఐటీ, ఈడీ దాడులు జరిగి ఉన్నట్టయితే ఆశ్చర్యపోయే వాస్తవాలు బయటకొచ్చి ఉండేవని అభిప్రాయపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి తమ దృష్టికి వచ్చిన వాస్తవాల్లో ‘మచ్చుకు కొన్ని’ అంటూ.. తెలంగాణలోని జడ్చర్లలో ఏబీ వెంకటేశ్వరరావుకు 53.07 ఎకరాలు, పశుల గ్రామంలో 57.59 ఎకరాలు.. ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పథకం ద్వారా కూడా ఆయన లబ్ధి పొందారని అన్నారు.