Tollywood: 'ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు..' అంటూ హీరో సుధీర్ బాబు భావోద్వేగభరిత పోస్ట్

  • 2012, ఫిబ్రవరి 10న 'ఎస్‌ఎమ్‌ఎస్‌-శివ మనసులో శ్రుతి' విడుదల
  • ఈ ప్రయాణాన్ని ప్రేమిస్తున్నాను
  • భవిష్యత్తులోనూ ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాను

టాలీవుడ్ యువ హీరో సుధీర్‌ బాబు తన ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగభరితంగా ఓ పోస్ట్ చేశాడు. 2012, ఫిబ్రవరి 10న ఆయన పూర్తిస్థాయి హీరోగా నటించిన తొలి సినిమా 'ఎస్‌ఎమ్‌ఎస్‌-శివ మనసులో శ్రుతి' విడుదలైంది. ఆ తర్వాత ఆయన పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నానితో కలిసి 'వీ' అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సందర్భంగా ట్విట్టర్‌లో సుధీర్ బాబు స్పందిస్తూ.. 'ఇదే రోజు.. ఎనిమిదేళ్ల క్రితం... ఎస్‌ఎమ్‌ఎస్‌ విడుదలైంది. ఈ ప్రయాణాన్ని ప్రేమిస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇంకా నేర్చుకోవాలని, సినిమాపై మరింత ప్రేమ పెంచుకోవాలని భావిస్తున్నాను' అని సుధీర్‌ బాబు తెలిపాడు.

More Telugu News