Viswanth: మహేశ్ చేతుల మీదుగా రేపు రానున్న 'ఓ పిట్టకథ' టీజర్

  • వినోదమే ప్రధానంగా 'ఓ పిట్టకథ'
  • ఉత్కంఠను రేకెత్తించే మలుపులు 
  • దర్శకుడిగా చెందు పరిచయం

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ ఒక చిన్న సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా చెందు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్టుతో ఈ కథ నడవనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక టీజర్ ను రిలీజ్ చేయించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకి ఈ టీజర్ ను వదలనున్నారు. వినోదభరితమైన సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా ఈ కథ నడుస్తుందని దర్శకుడు చెందు చెప్పాడు. మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుందని అన్నాడు. విశ్వంత్ .. సంజయ్ .. బాలరాజు .. నిత్య శెట్టి .. బ్రహ్మాజీ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు.

More Telugu News