Machilipatnam: మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు

  • ఏపీలో మూడు ఓడరేవుల నిర్మాణానికి చర్యలు
  • పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
  • కార్పొరేషన్ లో డైరెక్టర్లుగా సీఎస్, ఐదుగురు ఉన్నతాధికారులు

ఏపీలో మూడు ఓడరేవుల నిర్మాణం, అభివృద్ధి కోసం చర్యలు ప్రారంభించారు. మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక కార్పొరేషన్లలో బోర్డు డైరెక్టర్లుగా సీఎస్, మరో ఐదుగురు ఉన్నతాధికారులు ఉంటారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏపీ మేరిటైమ్ బోర్డు పర్యవేక్షణలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా పనిచేస్తాయి. ఒక్కో కార్పొరేషన్ కు పెట్టుబడి నిధి రూపంలో 50 వేల షేర్లు జారీచేసేందుకు అనుమతి ఇచ్చారు.

More Telugu News