Karnataka: తల్లిని చాకుతో పొడిచి చంపిన కూతురు... కర్ణాటకలో కలకలం!

  • నిత్యమూ తల్లితో గొడవపడే అమృత
  • ఆగ్రహంతో చాకుతో దాడి
  • కేసును విచారిస్తున్న పోలీసులు

కన్నతల్లి అన్న కనీస కనికరం కూడా లేకుండా, తనకు అడ్డు తగులుతోందన్న ఆగ్రహంతో ఓ యువతి, క్రూరాతి కూరంగా అమ్మను హత్య చేసింది. కలకలం రేపిన ఈ ఘటన బెంగళూరు, కేఆర్ పురంలోని అక్షయనగర్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నిర్మల (55), తన కుమారుడు, కుమార్తె అమృతలతో కలిసి అక్షయ నగర్ లో నివాసం ఉంటోంది.

ఈ క్రమంలో తన తల్లితో నిత్యమూ గొడవలు పడుతూ ఉండే అమృత, ఆదివారం జరిగిన వాగ్వాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆపై నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోగా, అప్పటికే కోపంతో ఉన్న అమృత, ఓ చాకును తీసుకుని వెళ్లి, తల్లిని దారుణాతి దారుణంగా పొడిచి, హత్య చేసి పరారైంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న కుమారుడు కూడా పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కేఆర్ పురం పోలీసులు, ఘటనా స్థలిని సందర్శించి కేసు నమోదు చేసి, అమృత కోసం గాలిస్తున్నారు.

More Telugu News