TG Venkatesh: "మా తెలుగుదేశం నేతలు" అంటూ నాలిక్కరుచుకున్న టీజీ వెంకటేశ్

  • ఢిల్లీలో టీజీ మీడియా సమావేశం
  • సార్ మీది బీజేపీ అంటూ గుర్తుచేసిన మీడియా ప్రతినిధులు
  • తెలుగుదేశం కాదు తెలుగు ప్రజలు అంటూ వివరణ ఇచ్చిన టీజీ

రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ టీడీపీని వీడి బీజేపీలో చేరి కొన్ని నెలలు గడుస్తోంది. అయితే ఈ రాజ్యసభ సభ్యుడు ఇంకా తాను టీడీపీలో ఉన్నాననుకుంటున్నారేమో... తాజాగా మీడియా సమావేశంలో "మా తెలుగుదేశం నేతలు" అంటూ వ్యాఖ్యానించి నాలిక్కరుచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో ఓ మీడియా సమావేశంలో జరిగింది. అయితే, టీజీ ఆ వ్యాఖ్యలు చేయగానే చురుగ్గా స్పందించిన మీడియా ప్రతినిధులు "సార్ మీరిప్పుడు బీజేపీలో ఉన్నారు" అంటూ గుర్తు చేయడంతో ఆయన కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. "సారీ, తెలుగుదేశం కాదు, తెలుగు ప్రజలు" అంటూ మళ్లీ మొదట్నించి మాట్లాడారు.

More Telugu News