Narendra Modi: ప్రధాని మోదీ అసోం పర్యటన ఖరారు!

  • ఈ నెల 7న పర్యటించనున్న మోదీ
  • కోక్రజార్ పట్టణంలో ర్యాలీ, బహిరంగసభ
  • బోడో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కోక్రజార్

ప్రధాని మోదీ అసోం పర్యటన ఖరారైనట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నెల 7న కోక్రజార్ పట్టణంలో పర్యటించనున్నారు. బోడోల ప్రాబల్యం తీవ్రంగా ఉన్న ఈ ప్రాంతంలో నిర్వహించే ఓ ర్యాలీలో పాల్గొన్న అనంతరం నిర్వహించే సభలో మోదీ ప్రసంగిస్తారు.

కాగా, జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఈశాన్య రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా నిరసనలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల కారణంగా అసోంలోని గువహటి వేదికగా గత నెలలో నిర్వహించిన ‘ఖేలో ఇండియా’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ వెళ్లాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేసుకున్నారు. బోడో తీవ్రవాద బృందాలు, విద్యార్థి సంఘాలతో కేంద్ర ప్రభుత్వం గత వారం శాంతి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం అనంతరం అసోంలో పర్యటించేందుకు మోదీ వెళ్లనున్నారు.

More Telugu News