ఏపీకి తాజాగా ఐదుగురు ఐపీఎస్ లను కేటాయించిన కేంద్రం

  • రాష్ట్రానికి కొత్త ఐపీఎస్ లు
  • ఏపీకి 2018 బ్యాచ్ కు చెందిన అధికారులు
  • ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం
ఏపీకి కొత్తగా ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2018 బ్యాచ్ కు చెందిన ఐదుగురు అధికారులను ఏపీకి కేటాయించారు. కేవీ మహేశ్వర్ రెడ్డి (ఏపీ), కె.ప్రతాప్ శివకిశోర్ (ఏపీ), షఫాఖత్ (బీహార్), సుశీల్ షిరోన్ (ఢిల్లీ), రాహుల్ మీనా (రాజస్థాన్)లు ఇకపై ఏపీలో విధులు నిర్వర్తించనున్నారు. వీరిని ఏ స్థాయిలో నియమిస్తారన్నది ఇంకా తెలియరాలేదు.
Go Back to Shorts
Andhra Pradesh
IPS Officers
2018 Batch

More Telugu News