Visakhapatnam: విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి నిధుల విడుదల

  • విశాఖ మధురవాడలో మిలీనియం టవర్స్
  • ఇప్పటికే పూర్తయిన టవర్-ఎ
  • టవర్-బి కోసం రూ.19.73 కోట్లు విడుదల

విశాఖ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా వైసీపీ సర్కారు మిలీనియం టవర్-బి నిర్మాణం జరపాలని నిర్ణయించింది. అందుకోసం తాజాగా నిధులు విడుదల చేశారు. విశాఖలోని మధురవాడ వద్ద నిర్మించే మిలీనియం టవర్-నిర్మాణానికి రూ.19.73 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టవర్-ఎ నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం అక్కడినుంచే సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది.

More Telugu News