Amaravati: అమరావతిని కొనసాగించాలి: అమెరికాలోని ఆంధ్రుల వినతి

  • ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌తో భేటీ
  • రాజధాని అక్కడే ఉంచాలంటూ వినతిపత్రం
  • ఇప్పటికే పలు ప్రాంతాల్లో ర్యాలీలు

అమరావతి రాజధానిగా అత్యంత అనుకూలమైన ప్రాంతమని, అందువల్ల అక్కడే రాజధానిని కొనసాగించాలంటూ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులు విజ్ఞప్తి చేశారు. వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి పలు దేశాల్లో స్థిరపడిన ఆంధ్రులు పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ దేశంలో మన దేశ అత్యున్నత అధికారిని కూడా కలిసి తమ మనసులో మాట తెలియజేశారు. రాజధానిగా అమరావతికి ఉన్న అనుకూలతలు వివరించి దాన్నే కొనసాగించాలని కోరారు.

More Telugu News