Andhra Pradesh: ఏపీలో దశల వారీ మద్యపాన నిషేధంతో విజయం వైపు తొలిఅడుగు: మంత్రి నారాయణస్వామి

  • రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గింది
  • 26 శాతం లిక్కర్, 57 శాతం బీరు వినియోగం తగ్గాయి
  • డ్రంకెన్ డ్రైవ్ కేసులు 18 శాతం తగ్గాయి

ఏపీలో దశలవారీ మద్య పాన నిషేధంతో విజయం వైపు తొలి అడుగు వేస్తున్నానమని మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వినియోగం తగ్గిందని, 26 శాతం లిక్కర్, 57 శాతం బీరు వినియోగం తగ్గాయని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులు 18 శాతం తగ్గాయని, అక్రమ మద్యం, నాటుసారాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని అన్నారు. అక్రమ మద్యం సరఫరాపై నిఘా పెంచి కఠిన చర్యలు చేపడతామని అన్నారు.

More Telugu News