Telugudesam: ఇరవై రెండు మంది వైసీపీ ఎంపీలు సాధించిందేమీ లేదు!: కేశినేని నాని

  • కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచింది
  • ఈ బడ్జెట్ తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
  • బీజేపీకి ‘బీ’ టీమ్ గా వైసీపీ వ్యవహరిస్తోంది

కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఈ బడ్జెట్ తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల గురించిన ప్రస్తావన బడ్జెట్ లో లేదని, వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు. బీజేపీకి ‘బీ’ టీమ్ గా వైసీపీ వ్యవహరిస్తోందని, ఈ రెండు పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయని ఆరోపించారు.

More Telugu News