Naga Shaurya: సెన్సార్ పూర్తి చేసుకున్న 'అశ్వద్ధామ'

  • యాక్షన్ హీరోగా మారిన నాగశౌర్య
  • 2 గంటల 13 నిమిషాల రన్ టైమ్
  • ఈ నెల 31వ తేదీన భారీ విడుదల  

నాగశౌర్య కథానాయకుడిగా 'అశ్వద్ధామ' నిర్మితమైంది. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లుగా కలిపి నాగశౌర్యనే ఈ కథను తయారు చేయడం విశేషం. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. 2 గంటల 13 నిమిషాల రన్ టైమ్ ను ఈ సినిమా కలిగివుంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. నాగశౌర్య ఇంతకుముందు చేసిన 'నర్తనశాల'తో పరాజయం చూశాడు. అందువలన 'అశ్వద్ధామ'తో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

More Telugu News