carona virus: హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాపించిందన్న వదంతులు నమ్మొద్దు: మంత్రి ఈటల

  • రాష్ట్ర  వైద్య, ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది
  • రేపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తాం
  • కేంద్ర వైద్యుల బృందం ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తోంది

హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాపించిందన్న వదంతులను నమ్మొద్దని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ వదంతుల నేపథ్యంలో ఈటల స్పందిస్తూ, కరోనా వైరస్ కు సంబంధించిన అన్ని విషయాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఈ విషయమై రేపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర వైద్యుల బృందం  హైదరాబాద్ లోని ప్రభుత్వాసుపత్రులను సందర్శిస్తోందని చెప్పారు. రేపటి సమీక్ష అనంతరం ఈ వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కాగా, ఫీవర్ ఆసుపత్రిని కేంద్ర వైద్యుల బృందం ఇవాళ సందర్శించిన విషయాన్ని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. ఇదిలా ఉండగా, కేంద్రం నుంచి వచ్చిన వైద్య నిపుణుల బృందంలో 35 మంది ఉన్నారు.

More Telugu News