సీఎం జగన్ అహం దెబ్బతినడంతోనే.. మండలి రద్దుకు నిర్ణయం: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
- మండలి రద్దును వ్యతిరేకిస్తూ.. టీడీపీ బైక్ ర్యాలీ
- పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంపై వెంకన్న ఆగ్రహం
- వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై బెదిరింపు చర్యలకు దిగుతోంది
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకోవడంతో సీఎం జగన్ అహం దెబ్బతిని మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను బెదిరిస్తోందని ఆరోపించారు. మండలిని రద్దు చేసే ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు పొందిన ఇద్దరితోనూ రాజీనామా చేయించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.