YSRCP: ఏపీ అసెంబ్లీ ప్రారంభం... కాసేపు వాయిదా

  • చర్చ జరగాల్సిన అంశాల వివరాలను తెలిపిన స్పీకర్
  • కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం 
  • తర్వాత  తిరిగి  ప్రారంభం కానున్న అసెంబ్లీ 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే కాసేపు వాయిదా పడ్డాయి. అంతకు ముందు అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అంశాలను స్పీకర్ తమ్మినేని సీతారాం వివరించి చెప్పారు. కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత  తిరిగి అంసెబ్లీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అసెంబ్లీ ప్రారంభం కాగానే  శాసనమండలి రద్దు ప్రతిపాదనపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అనంతరం దీనిపై  చర్చించి, ఆమోదం తెలిపి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు.

More Telugu News