Vijay Sai Reddy: టీడీపీ ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టింది: విజయసాయి

  • ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి
  • తాజా రాజకీయ పరిస్థితులపై వ్యాఖ్యలు
  • టీడీపీ ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ ఎల్లో మీడియా ప్రతినిధులున్నారని వెల్లడి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలుగా పరిణమించాయని విమర్శించారు. శాసనమండలి రద్దుపై సీఎం జగన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టిందని తెలిపారు. వారి ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News