CM Ramesh: తన కుమారుడి పెళ్లికి రావాలంటూ ప్రధాని మోదీకి శుభలేఖ అందించిన సీఎం రమేశ్

  • ఫిబ్రవరి 7న సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం
  • ఇటీవలే దుబాయ్ లో ఘనంగా నిశ్చితార్థం
  • ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తెతో రిత్విక్ వివాహం

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి రావాలంటూ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో పీఎంవోలో మోదీని కలిసిన సీఎం రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు శుభలేఖ అందించారు. ఇటీవలే రిత్విక్ నిశ్చితార్థం ప్రముఖ ఇండస్ట్రియలిస్టు తాళ్లూరి రాజా కుమార్తె పూజతో దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం భారత్ నుంచి అతిథులు వెళ్లేందుకు సీఎం రమేశ్ ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.

More Telugu News