MIM: పత్తాలేని టీఆర్ఎస్, కాంగ్రెస్.. భైంసాలో మజ్లిస్‌దే హవా!

  • 26 వార్డులకు గాను 15 వార్డులను గెలుచుకున్న మజ్లిస్
  • తేలిపోయిన టీఆర్ఎస్
  • నిజామాబాద్ మేయర్ పీఠంపైనా కన్ను

నిర్మల్ జిల్లాలోని భైంసా మునిసిపాలిటీపై ఎంఐఎం జెండా ఎగురవేసింది. నిన్న విడుదలైన మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించింది. కొన్ని వార్డుల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఎంఐఎం ముందు నిలవలేకపోయింది. ఇక, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు పత్తాలేకుండా పోయాయి.

మొత్తం 26 వార్డులకు గాను మజ్లిస్ 15 వార్డులను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. భైంసాలో మంచి పట్టున్న మజ్లిస్ గత పదేళ్లలో మూడుసార్లు జయకేతనం ఎగురవేసింది. తాజాగా, మరోసారి సత్తాచాటింది. మరోవైపు, మిత్రపక్షం టీఆర్ఎస్‌ మద్దతుతో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అధిష్ఠించే అవకాశానికి చేరువైంది. గతంలో పోటీ చేయని స్థానాల్లోనూ ఈసారి మజ్లిస్ విజయం సాధించడంతో ఆపార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

More Telugu News