Sharwanand: శర్వానంద్ హీరోగా 'మహాసముద్రం'?

  • 'ఆర్ ఎక్స్ 100' తో భారీ విజయం  
  • తదుపరి సినిమాకి అజయ్ భూపతి సన్నాహాలు
  • రంగంలోకి శర్వానంద్  
శర్వానంద్ తాజా చిత్రంగా 'జాను' రూపొందుతోంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ తన తదుపరి సినిమాగా 'మహాసముద్రం' చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం.

'ఆర్ ఎక్స్ 100' చిత్రంతో యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ తరువాత 'మహాసముద్రం' కథను సిద్ధం చేసుకున్నాడు. నాగచైతన్య - సమంత జంటగా ఆయన ఈ సినిమాను చేయాలనుకున్నాడు. చైతూ - సమంత ఇద్దరికీ కథ వినిపించడం జరిగిపోయింది. అయితే చైతూకి గల కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యేలా వుందట. అందువలన శర్వానంద్ ను అజయ్ భూపతి సంప్రదించడం .. అయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఇక కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.
Sharwanand
Ajay Bhupathi
Naga Chaitanya
Samantha

More Telugu News