Chandrababu: మండలిలో మంత్రుల వైఖరిపై గవర్నర్ కు పెన్ డ్రైవ్ ను అందజేసిన చంద్రబాబు

  • గవర్నర్ తో చంద్రబాబు భేటీ
  • శాసనసభ, మండలి సమావేశాల తీరును వివరించిన బాబు
  • ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు

గత కొన్నిరోజులుగా ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వ వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సాయంత్రం ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ముఖ్యంగా, మండలిలో వైసీపీ మంత్రుల తీరుతెన్నులకు సంబంధించిన ఓ పెన్ డ్రైవ్ ను గవర్నర్ కు అందజేశారు. మంత్రులు చైర్మన్ పోడియంను ముట్టడించి, అనుచితంగా ప్రవర్తించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

More Telugu News