Amaravati: మూడు రాజధానులకు వ్యతిరేకంగా మంగళగిరిలో ప్రజాగర్జన

  • అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతూ మంగళగిరిలో భారీ ర్యాలీ
  • ర్యాలీలో భారీగా పాల్గొన్న మహిళలు, విద్యార్థులు
  • ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన లోకేశ్
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంతం మంగళగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, విద్యార్థులు పోటెత్తిన ఈ ర్యాలీలో నల్లజెండాలు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ ముద్దు అనే నినాదాలతో మంగళగిరి హోరెత్తింది. ఈ ర్యాలీలో కిలోమీటర్ల పొడవునా మహిళలు, విద్యార్థులు బారులు తీరి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 'తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమిస్తున్నారో చూడండి' అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Amaravati
Mangalagiri
AP Capital
Rally
Jagan
YSRCP
Telugudesam

More Telugu News