Mahesh Babu: మరోసారి మహేశ్ బాబుకి జోడీగా కైరా అద్వాని

  • యూత్ లో కైరా అద్వానీకి విపరీతమైన క్రేజ్ 
  • గతంలో మహేశ్ తో చేసిన 'భరత్ అనే నేను'
  • వంశీ పైడిపల్లికి సిఫార్స్ చేసిన నమ్రత  

మహేశ్ బాబు తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. మహేశ్ బాబుకి ఇది 27వ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలను చేయడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి అవకాశం లభిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. దాదాపుగా ఈ అవకాశం కైరా అద్వానికి దక్కవచ్చని అంటున్నారు. అంత నమ్మకంగా చెప్పడానికి గల కారణం .. ఆమెను సిఫార్స్ చేస్తున్నది 'నమ్రత' కావడమే.

మహేశ్ బాబు - కైరా అద్వాని కాంబినేషన్లో ఇంతకుముందు 'భరత్ అనే నేను' వచ్చింది. కథాకథనాలపరంగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక మహేశ్ బాబు - కైరా జోడీకి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించిందని భావించిన నమ్రత, తాజా చిత్రానికి కైరాను తీసుకోమని వంశీ పైడిపల్లికి చెప్పిందట. అందువలన కైరా ఎంపిక దాదాపు ఖరారైనట్టుగానే చెప్పుకోవాలి.

More Telugu News