Andhra Pradesh: మండలి నిర్ణయం తర్వాత మందడం వెళ్లిన చంద్రబాబు... స్వాగతం పలికిన రైతులు

  • మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు లభించని ఆమోదం
  • సెలెక్ట్ కమిటీకి పంపిన చైర్మన్
  • రాజధాని గ్రామాల్లో సంతోషకర వాతావరణం

వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. మందడం గ్రామానికి వెళ్లిన ఆయనకు రైతులు స్వాగతం పలికారు. మండలి నిర్ణయం నేపథ్యంలో చంద్రబాబుకు, టీడీపీకి రైతులు, మహిళలు అభినందనలు తెలిపారు. మందడం పర్యటన సందర్భంగా చంద్రబాబు వెంట లోకేశ్, బాలకృష్ణ కూడా ఉన్నారు. రాజధాని ప్రజలు చంద్రబాబుతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు.

More Telugu News