Paruchuri: హీరోయిన్ రంజిత అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ అర్థం కాలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • 'కడప రెడ్డెమ్మ' ద్వారా రంజిత పరిచయమైంది 
  •  తమిళంలో హీరోయిన్ గా ఎదిగింది
  • ఆమె ఏదో భ్రమలో పడిపోయిందన్న పరుచూరి

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా రంజిత మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాంటి రంజితను గురించి తాజాగా 'పరుచూరి పలుకులు'లో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "రంజితను చూడగానే ఆ అమ్మాయికి హీరోయిన్ అయ్యే లక్షణాలు వున్నాయనిపించింది. వాళ్ల నాన్నగారిని ఒప్పించడం వలన, తెలుగు తెరకి 'కడప రెడ్డెమ్మ' సినిమా ద్వారా పరిచయమైంది.

ఆ తరువాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి కథానాయికగా అగ్రస్థానాన్ని అందుకుంది. ఆ తరువాత దర్శకురాలిగా మారాలని ఉందంటే వారించాను. అప్పుడు వెళ్లిపోయిన ఆ అమ్మాయి చాలాకాలం క్రితం నా దగ్గరికి వచ్చినప్పుడు 'నిత్యానంద'ను గురించి ప్రస్తావించింది. నిత్యానంద రాసిన ఒక బుక్ నాకు ఇస్తూ ఆయన మీటింగ్ కి రమ్మని అడిగింది. అలాంటివాళ్లు నాకు ఎక్కరని అన్నాను. 'నువ్వు కూడా వెళ్లకు' అని చెప్పుంటే బాగుండేదేమో. ఏ భ్రమలో పడి అటువైపు వెళ్లిందోగానీ, ఆ తరువాత ఆమె జీవితంలో అనేక మలుపులు. వాళ్ల నాన్న కోరుకున్న కుటుంబ జీవితాన్ని .. నేను ఆశించిన సినిమా జీవితాన్ని కాదని ఆమె అలా ఎందుకు వెళ్లిపోయిందనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు" అని ఆవేదనను వ్యక్తం చేశారు.

More Telugu News