Andhra Pradesh: పిరికిపంద వైసీపీ.... ముఖం చూపించుకోలేక ప్రత్యక్ష ప్రసారాలు ఆపేశారు: చంద్రబాబు

  • వైసీపీ సర్కారుపై చంద్రబాబు ధ్వజం
  • మండలిలో లైవ్ టెలికాస్ట్ ఆపేశారంటూ ఆగ్రహం
  • వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్

మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తుండడంతో పిరికిపంద వైసీపీ ముఖం చూపించుకోలేకపోతోందని, శాసనమండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయడమే అందుకు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. నిలిపివేసిన లైవ్ టెలికాస్ట్ ను వెంటనే పునరుద్ధరించాలని, వికేంద్రీకరణ బిల్లును రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు. 'జగన్ సిగ్గుపడాలి' అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పోస్టు చేశారు.

More Telugu News