Police: పెట్రోలింగ్ చేయాల్సిన కానిస్టేబులే దొంగగా మారాడు!

  • నోయిడా ప్రాంతంలో ఘటన
  • స్టోర్ ముందున్న పాల ప్యాకెట్ల దొంగతనం
  • కానిస్టేబుల్ ను గుర్తించే పనిలో అధికారులు

రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తూ, ప్రజలను కాపాడాల్సిన ఓ కానిస్టేబుల్ దొంగగా మారి, సీసీటీవీ కెమెరాలకు అడ్డంగా చిక్కాడు. ఈ ఘటన న్యూఢిల్లీ శివార్లలోని నోయిడాలో జరిగింది. ఇక్కడి ఓ స్టోర్ వద్ద ఆరుబయట పాల వ్యాన్ వచ్చి, పాల ప్యాకెట్ ట్రేలను ఉంచి వెళ్లగా, అదే దారిలో పోలీసు పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ లో నుంచి దిగిన ఓ పోలీసు, పాల ప్యాకెట్లను చోరీ చేసి, వ్యాన్ లో ఉన్న మరో కానిస్టేబుల్ కు ఇచ్చాడు. ఈ దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, పోలీసు దొంగగా మారిన వీడియో వైరల్ అయింది. సదరు కానిస్టేబుల్ ను గుర్తించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. 

More Telugu News