Dwarampudi Chandrasekhar Reddy: పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ద్వారంపూడిపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు
- పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే
- ఆయన ఇంటిని చుట్టుముట్టిన కార్యకర్తలపై దాడి
- చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు జన సామ్రాజ్యం పార్టీ ఫిర్యాదు చేసింది. ఇటీవల ద్వారంపూడి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టారని విమర్శించారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే నువ్వూ ఓ నాయకుడివేనా? అని ప్రశ్నిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన పక్కన కాకినాడ ఎంపీ వంగా గీత కూడా ఉన్నారు.
పవన్పై ద్వారంపూడి వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు, మహిళలు కాకినాడలోని ఆయన ఇంటిని చుట్టుముట్టారు. దీంతో రంగంలోకి దిగిన ద్వారంపూడి అనుచరులు కర్రలు, రాళ్లతో వారిపై దాడిచేశారని, ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ జన సామ్రాజ్యం పార్టీ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ మానవహక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
పవన్పై ద్వారంపూడి వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు, మహిళలు కాకినాడలోని ఆయన ఇంటిని చుట్టుముట్టారు. దీంతో రంగంలోకి దిగిన ద్వారంపూడి అనుచరులు కర్రలు, రాళ్లతో వారిపై దాడిచేశారని, ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ జన సామ్రాజ్యం పార్టీ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ మానవహక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు.