అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కు.. అశాంతి కావాలంటే ఎంఐఎం, బీజేపీలకు ఓటేయండి: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి
- ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎంకు మేయర్ పదవి ఇవ్వం
- తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఊపందుకుంది
- ఎంఐఎంతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు
మేయర్ సీటు ఇచ్చేందుకు ఎంఐఎంతో టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుందంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఐఎంకు మేయర్ స్థానం ఇవ్వమని తేల్చి చెప్పారు. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కు, అశాంతి కావాలంటే ఎంఐఎం, బీజేపీలకు ఓటేయాలని చెప్పారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.