Allu Arjun: బన్నీ మూవీ టైటిల్ పై స్పందించిన దర్శక నిర్మాతలు

  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ 
  •  కథానాయికగా రష్మిక 
  • కేరళ అడవుల్లో కొనసాగనున్న చిత్రీకరణ

అల్లు అర్జున్ తదుపరి సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ ను కేరళ అడవుల్లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టైటిల్ ఫలానా అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శక నిర్మాతలు స్పందించారు. తమ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదని చెప్పారు. ఫలానా టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. టైటిల్ ను ఖరారు చేసిన తరువాత తాము అధికారికంగా తెలియజేస్తామనే విషయాన్ని స్పష్టం చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News