మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలిసిపోతుంది.. పొరపాటు చేయవద్దు: ఎర్రబెల్లి
- వేరే పార్టీకి ఓటు వేసి ఆ తర్వాత బాధ పడొద్దు
- టీఆర్ఎస్ కు ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యం
- ఎవరికి ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటా
మీరు ఎవరికి ఓటు వేసినా తనకు తెలిసిపోతుందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. వేరే పార్టీకి ఓటు వేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదని... పొరపాట్లకు తావివ్వకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్ఎస్ కే ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే... ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిని అయ్యానని... మరో నాలుగేళ్లు పదవిలో కొనసాగుతానని చెప్పారు. తాను చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉందని... టీఆర్ఎస్ ను గెలిపించడం ద్వారా అందరూ తనకు సహకరించాలని విన్నవించారు.