పవన్ కల్యాణ్ తో కలవడం మంచి పరిణామం: కృష్ణంరాజు
- ఒకటికి రెండు పార్టీలు కలిస్తే బలోపేతం అవ్వచ్చు
- రాష్ట్రానికి మంచి జరుగుతుంది
- ఏ సిద్ధాంతం ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి
సిద్ధాంతాలను కలుపుకుని ముందుకుపోవడం, ఏ సిద్ధాంతం ఎవరినీ ఇబ్బందిపెట్టకుండా చూసుకుని ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేసినంత కాలం ఎంతో బాగుంటుందని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అటు, బీజేపీ కూడా ఏపీలో కాలుమోపేందుకు ప్రయత్నిస్తోందని, పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలో బీజేపీ పవన్ కల్యాణ్ తో కలవడం శుభపరిణామంగా అభివర్ణించారు.