Chittoor District: కుమారుడి మరణవార్త విని తల్లి మృతి!

  • చిత్తూరు జిల్లా చంద్రగిరిలో విషాద ఘటన
  • గుండెపోటుతో వినోద్ కుమార్ (30) మృతి
  • విషయం తెలుసుకుని కుప్పకూలిపోయిన తల్లి సరోజమ్మ (59)  

తన కుమారుడే సర్వస్వంగా ఆమె జీవించింది. అతడు లేని జీవితాన్ని ఒక్క నిమిషం కూడా భరించలేకపోయింది. ఈ క్రమంలో కుమారుడి మరణవార్త విన్న కొద్దిసేపటికే తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు అలా కుమారుడు, తల్లి మరణించారు.

వివరాల్లోకి వెళ్తే... వినోద్ కుమార్ (30) అనే వ్యక్తి ఇంట్లోంచి బయటకు వెళ్లిన సమయంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అతడి తల్లి సరోజమ్మ (59) ఇంట్లో ఉంది. తనయుడు చనిపోయాడని ఆమెకు సమాచారం అందింది. తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆమె కుప్పకూలిపోయి మృతి చెందింది.

More Telugu News