KTR: విదేశాలకు వెళుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్

  • స్విట్జర్లాండ్ లోని దావోస్ కు ప్రయాణం 
  • ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న మంత్రి 
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరవుతున్న సమావేశం

తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) విదేశాలకు ప్రయాణమవుతున్నారు. స్విట్జర్లాండ్ రాజధాని దావోస్ కు వెళుతున్నారు. అక్కడ ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే అంతర్జాతీయ ఆర్థిక మండలి వార్షిక సదస్సులో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోపాటు ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News