RBI: డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు ఇకపై ఆన్‌, ఆఫ్‌ సదుపాయం

  • సైబర్‌ నేరాల కట్టడికి బ్యాంకుల తాజా ప్రయత్నం
  • ఆర్‌బీఐ ఆదేశాలతో కార్యాచరణకు శ్రీకారం
  • కొన్ని సేవలను యాక్టివ్‌, నాన్‌ యాక్టివ్‌ పెట్టే సదుపాయం

బ్యాంకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు. ముఖ్యంగా డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల లావాదేవీల్లో మోసాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు కార్డుల్లో సరికొత్త ఫ్యూచర్లను బ్యాంకులు అందుబాటులోకి తెస్తున్నాయి. డిజిటల్‌ లావాదేవీలకు మరింత రక్షణ కల్పించేందుకు కార్డులో ఆన్‌ ఆఫ్‌ సదుపాయం, ప్రజెంట్‌, నాట్‌ ప్రెజెంట్‌ ముఖ్యమైనవి. కార్డుదారుడు తనకు అవసరం లేదనుకున్నప్పుడు, అనుమానం కలిగినప్పుడు తన క్రెడిట్‌, డెబిట్‌ కార్డును ఆఫ్‌ చేసుకోవచ్చు.

దీనివల్ల సైబర్‌ నేరగాళ్లు లేదా చోరులకు కార్డు వివరాలు చిక్కినా లావాదేవీలు నిర్వహించుకోలేరు. ముఖ్యంగా కార్డు యజమాని తనకు అవసరమైనప్పుడు మాత్రమే కార్డు, అందులోని ఆప్షన్లు పనిచేసేలా చూసుకోవచ్చు. అలాగే, కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌ ఆప్షన్‌ ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించినది. ఇది లావాదేవీలకు పరిమితి నిర్దేశం లేదా సవరణకు అవకాశం కల్పిస్తుంది.

ఈ ఆప్షన్‌ ఎంచుకునే వారికి అన్ని రకాల (దేశీయ, అంతర్జాతీయ, పీఓఎస్‌, ఏటీఎం, ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌) లావాదేవీలు, అన్ని మార్గాల్లో (మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం, ఐవీఆర్‌) 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే జారీ చేసిన కార్డుల విషయంలో వినియోగదారుల రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా తమకు తగిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఇప్పటి వరకు ఆన్‌లైన్‌(కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌)/అంతర్జాతీయ/కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఉపయోగించని కార్డులో  ఈ ఆప్షన్లను తప్పనిసరిగా డీయాక్టివేట్‌ చేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News