Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' రెండు రోజుల వసూళ్లు

  • తొలి రోజునే సక్సెస్ టాక్ 
  • నైజామ్ లోను భారీ వసూళ్లు
  • లాభాల బాట దిశగా ప్రయాణం

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగిన ఈ సినిమా, తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనే ఈ సినిమా 63 కోట్ల గ్రాస్ ను .. 42.20 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా రెండు రోజుల్లో 12.68 కోట్లను వసూలు చేసింది.

 ఈ సినిమా లాభాల బాట పట్టడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. అనిల్ రావిపూడి తయారు చేసుకున్న కథాకథనాలు .. ఆయన టేకింగ్ .. బలమైన తారాగణం .. కామెడీకి పెద్దపీట వేయడం .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మొదలైన అంశాలు ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడానికీ.. ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణమని చెప్పుకుంటున్నారు. ఈ పండుగ రోజుల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News