Mahesh Babu: మీరు ప్రశ్నించండి... సమాధానాలు చెబుతా: ట్విట్టర్లో అభిమానులకు మహేశ్ బాబు పిలుపు

  • బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ ప్రిన్స్
  • ప్రశ్నలు సంధించాలని కోరిన మహేశ్ బాబు
  • ట్విట్టర్ ద్వారా సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు

తన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, తన ఫ్యాన్స్ కు బంపరాఫర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా, ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పనున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు. తన కొత్త చిత్రంపై వచ్చిన అద్భుత స్పందనపై స్పందిస్తూ, సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాన్స్ తనపై ప్రశ్నలను సంధించాలని కోరారు.

More Telugu News