CAA: సీఏఏపై లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారు: బీజేపీ నేత కన్నా

  • గుంటూరులో సీఏఏ అంశంపై సదస్సు
  • ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయి
  • కేంద్ర పథకాలను చూసి ఓర్వలేకనే ఇలాంటి దుష్ప్రచారం

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై సృష్టిస్తున్న లేనిపోని వదంతులను నమ్మొద్దని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. గుంటూరులోని కన్వెన్షన్ సెంటర్ లో సీఏఏ అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సీఏఏ పై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేకనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News