నటి కల్యాణిది హత్యే.. ఈఎస్ఐ శ్మశాన వాటికలో సినీ ఆర్టిస్టుల ధర్నా
- ఆమె శరీరంపై గాయాలున్నాయని ఆరోపణ
- దోషులను శిక్షించేంత వరకు అంత్యక్రియలు జరగనివ్వబోమన్న ఆర్టిస్టులు
- పోలీసుల హామీతో ఆందోళన విరమణ
విషయం తెలుసుకున్న సహ కళాకారులు 30 మంది శ్మశాన వాటికకు చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఆమె మృతిపై తమకు అనుమానాలున్నాయని అన్నారు. కల్యాణి శరీరంపై గాయాలున్నాయని, అది తప్పకుండా హత్యేనని ఆరోపించారు. దోషులను శిక్షించేంత వరకు అంత్యక్రియలు జరగనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్మశానానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.