Amartya Sen: పౌరసత్వ చట్టంపై అమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు

  • పౌరసత్వ చట్టం రాజ్యాంగ విరుద్ధం
  • మతాన్ని పౌరసత్వంతో ముడిపెట్టకూడదు
  • ఎక్కడ పుట్టాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? అనేదే పౌరసత్వాన్ని నిర్ణయిస్తుంది
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతపరమైన వ్యత్యాసాలను పౌరసత్వంతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించాలని కోరారు.

బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన అమర్త్యసేన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? అనేదే పౌరసత్వాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు.

మతం పేరుతో అణచివేతకు గురి చేయాలనే ఈ అంశంపై రాష్ట్ర అసెంబ్లీలలో చర్చ జరగాలని సేన్ సూచించారు. మన దేశానికి వెలుపల ఉన్న హిందువులపై సానుభూతి చూపాల్సిందేనని, వారిని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని కూడా ఆయన అన్నారు. పౌరసత్వం చట్టం మతాలకు అతీతంగా ఉండాలని చెప్పారు.
Amartya Sen
CAA

More Telugu News